మోర్జంపాడు గ్రామ సమీపమున గల శ్రీ భ్రమరాంబా సమేత బుగ్గమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగినట్లుగా శిలా శాసనం ద్వారా తెలియుచున్నది. ఈ పురాతన ఆలయం సువిశాలమైన అంతరాలయం మరియు 16 స్థంభములతో కూడిన ముఖ మండపముతో విరాజిల్లుతున్నది.
బుగ్గ మల్లేశ్వర స్వామి విశిష్టత
గర్భాలయంలో శివ లింగము పక్కన నీటి బుగ్గ కలదు. ఈ నీటి బుగ్గ నుండి ఎంత నీరు తీసిననూ తరగక, తిరిగి అంతే నీటితో నిండి ఉండటం ఇక్కడి విశేషం. ఈ గంగాజలంతోనే స్వామి వారికి అభిషేకములు జరుపబడును. సూర్య రశ్మి సోకకపోయినా ఈ నీరు చెడిపోక ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండటం ఈ క్షేత్ర మహిమకు నిదర్శనం.
ఉత్తర వాహినిగా ప్రవహించుచున్న కృష్ణా నది తీరాన వెలసిన ఈ స్వయంభూ క్షేత్రం అనుష్ఠాన సాఫల్యతకు అత్యంత విశేషమైనది. పూర్వం మహర్షులు ఈ నదిలో స్నానమాచరించి ఇక్కడ తపస్సు చేసేవారని ప్రతీతి. అందువల్ల ఈ ఆలయం "ఋషి ప్రతిష్ట" గా ప్రసిద్ధి చెందింది.
ఆలయ శిలాఫలకం
శ్రీ భ్రమరాంబా అమ్మవారు
శ్రీ భ్రమరాంబా అమ్మవారి ఆలయం
శ్రీశైలం మాదిరిగానే ఇక్కడ కూడా వాయువ్య భాగాన ఎత్తయిన ప్రదేశంలో శ్రీ భ్రమరాంబా అమ్మవారు కొలువై ఉండటం మరో విశేషం. అమ్మవారి విగ్రహం అత్యంత సౌందర్యంతో, భక్తులకు అభయప్రదాతగా నిలుస్తుంది.
వృద్ధ మల్లేశ్వర స్వామి
వృద్ధ మల్లేశ్వర స్వామి ఆలయం
శ్రీశైల క్షేత్రంలో ఉన్న విధముగా ఈ ఆలయ ప్రాంగణంలో వృద్ధ మల్లేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ శివలింగంతో పాటు రాజరాజేశ్వరి అమ్మవారు కూడా భక్తులకు దర్శనమిస్తారు.
ఆలయ ప్రాంగణం మరియు ఉపాలయాలు
ఈ క్షేత్రంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, మృత్యుంజయ సహిత నవగ్రహ మండపం మరియు యాగశాల వంటి ఉప ఆలయాలు భక్తులతో అలరారుతున్నాయి.
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
చారిత్రక నేపథ్యం
18వ శతాబ్దంలో అమరావతీ సంస్థానాధీశుడు, పరమ శివభక్తుడైన శ్రీవాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు కామేపల్లి గ్రామ పర్యటనకు వచ్చినసమయంలో ఈ క్షేత్రాన్ని సందర్శించారు. శివారాధన చేయకుండా ఆహారంతీసుకోకూడని నియమం గల వారు కావున, ఈ అడవిలో ఉన్న ఆలయాన్నిదర్శించి అభిషేకాలు నిర్వహించారు.
ఆ సమయంలో దేవాలయ ధర్మకర్త అయిన శ్రీ మండాది సీతారామయ్య గారిద్వారా ఆలయ విశిష్టతను తెలుసుకున్న సంస్థానాధీశుడు, ఆలయఅభివృద్ధికి ఎంతో మాన్యాన్ని (భూమి) బహుకరించినట్లు చరిత్ర ద్వారాతెలియుచున్నది.
శ్రీ రామ మరియు ఆంజనేయ స్వామి ఆలయం
ఆలయ దక్షిణ భాగంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం, దానికి ఎదురుగా ఈ క్షేత్ర పాలకునిగా కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఉన్నాయి.
శ్రీ రామ ఆలయం
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం
సర్వేజనాః సుఖినోభవంతు